Patanotsavam

 ప్రభుత్వ పాఠశాలల్లో 26 జూన్ నుండి పఠనోత్సవం 

          
ఈ విద్యా సంవత్సరంలో భాగంగా 26 జూన్ సోమవారం నుండి 31 జూలై వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పఠనోత్సవం కార్యక్రమం నిర్వహించాలి.

@     విద్యార్థులు ధారాళంగా చదవడం చదవడం ఒక అలవాటుగా చేసుకోవడం చదువుతూ ఆనందం పొందడం స్వతంత్ర పాఠకులుగా ఎదగడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.

 @    పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమం నిర్వహించాలి 

@    ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

@    ఇందులో భాగంగా ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ ( లైబ్రరీ) కేటాయించాలి.

@    ప్రతిరోజు ప్రతి పీరియడ్లు ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి.చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి.

@    అలాగే గ్రంధాలయ పీరియడ్ లో ప్రతిరోజు విద్యార్థులచే కథల పుస్తకాలు చదివించాలి.
మూడు రోజులు మాతృభాషలో మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివించాలి.

@    గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయాలి వీరు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకుని చదివేల ప్రోత్సహించాలి.

@    విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వారిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.

@    ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివే విధంగా వారికి గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజిన్ లు కూడా ఇవ్వాలి, వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని చెప్పండి.

@    ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చదివించాలి.

@    విద్యార్థులు చదివే సందర్భంలో వాటిని వీడియో చేసి పాఠశాల గ్రూపుల్లో షేర్ చేయాలి, అలాగే వాటిని జిల్లా స్థాయికి రాష్ట్రస్థాయికి తల్లిదండ్రులకు పంపాలి.

@    విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పట్టణ పోటీలు నిర్వహించాలి

@    ప్రతి మాసంలో మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులచే చదివించాలి బాగా చదివే పిల్లలను అభినందించాలి.

@    విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదివే విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించమని చెప్పాలి

@    విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలని ఇవ్వాలి

@    స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యులను ఇందుకోసం వినియోగించుకోవాలి .

@    అన్ని పాఠశాలల్లో 10 జూలై నుండి 15 జులై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

@    విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించాలి.

@    విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు ,ఇతరులు పాఠశాలను సందర్శించిన సందర్భంలో వారిచే గ్రంథాలయంలోని కథల పుస్తకాలను విద్యార్థుల ముందు వారిచే చదివింప చేసి విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందింప చేయాలి .

@    15 జూలై రోజు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి ప్రముఖులను ఆహ్వానిచాలి.

@    ప్రతి ఉపాధ్యాయుని వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు ఎంతమంది నెమ్మదిగా చదువుతారు ఎంతమంది చదువు రానివారు ఉన్నారు మొదలైన వివరాలు కలిగి ఉండాలి.

@    ప్రధానోపాధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలకు సంబంధించిన వివరాలు ఉండాలి.

@    కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసం గా సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి, కాంప్లెక్స్ సమావేశాల్లో వీటిని సమీక్షించుకోవాలి.

@    మండల విద్యాధికారులు నోడల్ అధికారులు తొలిమెట్టు కార్యక్రమంలో సూచించిన విధంగా వివిధ పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి.

@    మండల , జిల్లా స్థాయిలో తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులతో కోర్ కమిటీ టీం ఏర్పాటు చేసి వారు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కథలు గేయాలు ఆడియో స్టోరీస్ మొదలైన వాటిని పాఠశాలలకు పంపే విధంగా చూడాలి.

@    జిల్లాస్థాయిలో నెలకొకమారు మండల విద్యాధికారులు నోడల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలి, ఇందులో డైట్ లెక్చరర్స్ ను భాగస్వాములు చేయాలి.

@    రాష్ట్రస్థాయిలోని ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష అధికారులు వివిధ జిల్లాలో మానిటరింగ్ నిర్వహిస్తారు.

@    ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దీనిద్వారా తొలిమెట్టు ద్వారా మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం కావున ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నోడల్ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి.

DOWNLOAD :